Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టణ అభివృద్ధికి తాము ఆటంకం కలిగించము

పట్టణ అభివృద్ధికి తాము ఆటంకం కలిగించము

జనరల్ ఫండ్స్ నుంచి సంబంధిత వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి

వీధి దీపాలు, నీటి కొరత లేకుండా చూడాలి.. పలువురు కౌన్సిలర్లు డిమాండ్.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లుగా తాము ఎప్పుడూ కూడా అడ్డగించబోమని, జనరల్ ఫండ్స్ నుంచి సంబంధిత వాటికి మాత్రమే మున్సిపల్ అధికారులు ఖర్చు చేయాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్మన్ లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో 16 అంశాలతో గల వాటిని చర్చించి ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జయరాం రెడ్డి, కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి మాసపల్లి సాయికృష్ణ, గజ్జల శివయ్య, గోరకాటి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ స్థలాలకు కంచె, స్తంభాలు నాటిన సమాచారం ఎంతవరకు పూర్తి అయ్యింది, వాటి వివరాలను తెలుపాలని కౌన్సిల్లో అడగడం జరిగింది. నాలుగు రోజుల లోపల కౌన్సిల్లో సమాచారం అందిస్తామని కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి లేదని అవినీతి జరుగుతోందని వారు అధికారులపై ఆరోపించారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు జనరల్ ఫండ్ నిధులతో నగదు ఇవ్వరాదని తెలిపారు. మున్సిపల్ ఆదాయంతో అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టాలని తెలిపారు. మున్సిపల్ కు సంబంధించిన మార్కెట్లో ఇంతవరకు 90 లక్షల రూపాయలు బకాయి ఎందుకు వసూలు చేయలేదని వారు ప్రశ్నించారు. అదేవిధంగా గతంలో మార్కెట్ దగ్గరకు మాత్రమే కాయగూరలు, చేపలు మాత్రమే కొనుగోలు చేయాలన్న తీర్మానం కూడా జరిగిందని, కానీ ఇప్పుడు కాయగూరల మార్కెట్ కు అవతల వాళ్ళు తోపుడు బండ్లు, షాపులు ఉండడంతో మార్కెట్లో ఉన్న షాపుల వారికి ఆదాయం లేకుండా పోతుందని, బాడిగ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కావున వెంటనే ఆ తోపుడుబండ్లను, బయట గల షాపులను వ్యాపారం నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మార్కెట్లో ఇంకను మున్సిపల్ గదులు ఉన్నాయని, వాటిని భర్తీ చేయవలసిన బాధ్యత అధికారులదే నని వారు తెలిపారు. అదేవిధంగా కాలువల్లో పూడికలు తీస్తున్నారని, కల్వర్ట్లకు రిపేరీ ఖర్చులు వివరాలు తెలపాలని అడిగారు. అదేవిధంగా పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గతంలో కుటుంబ నియంత్రణ కొరకు అప్పటి ఎమ్మెల్యే ద్వారా ప్రారంభించిన గదిలో గల పరికరాలు ఎందుకు మాయమయ్యాయని వారు ప్రశ్నించారు. దానికి భద్రత సంబంధిత అధికారులదే కదా అని వారు గుర్తు చేశారు. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయంలో చెత్త వాహనాలు మూలకుపడి ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేసి పట్టణ పరిశుభ్రత కొరకు ఉపయోగించాలని వారు తెలిపారు. కాంట్రాక్టర్లు ఇచ్చిన పనులను అధికారులు తనిఖీలు చేయడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా రానున్నది వర్షాకాలం కావున వార్డులలో కంప చెట్లు అధికంగా ఉన్నాయని వాటిని తొలగించాలని తెలిపారు. తదుపరి ప్లాస్టిక్ నిషేధం విషయంలో ఏమాత్రం ఫలితం లేదని, పూర్తి దశలో నిషేధించే దిశలో అధికారులు కృషి చేయాలని తెలిపారు. తదుపరి కదిరి గేట్ నుండి సమాధుల వరకు ఎక్కడపడితే అక్కడ చేపలు అమ్మడం వలన, మార్కెట్లో ఉన్న చేపల వ్యాపారిస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒకే చోటు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా డివైడర్ల మధ్యలో ఇనుప ఫోన్లు తుప్పుపట్టాయని, ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున, డివైడర్ మధ్యలో సిమెంటుతో కూడిన రంధ్రం తయారుచేసి ఫోను నాటాలని తెలిపారు. అదేవిధంగా డివైడర్ అటువైపు ఇటువైపు గల కాలువల్లో మధ్యలో ఒక పెద్ద గుంత వేయించాలని, వర్షాకాలం వచ్చినప్పుడు నీరు రోడ్డు వైపు రాకుండా గుంతలో పోయే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. అనంతరం కమిషనర్ తో పాటు పలువురు అధికారులు సమాధానం ఇస్తూ మున్సిపల్ ఖాళీ స్థలాలు వివరాలను మరో కౌన్సిల్ సమావేశంలో తప్పక ఇస్తామని తెలిపారు. మార్కెట్లో రావలసిన 90 లక్షల బకాయిని వెంటనే వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. పూడికల తీత, నూతన కాలువ నిర్మాణం పై మరోసారి శ్రద్ధ వహించి పనిచేసేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. కుక్కల కుటుంబ నియంత్రణ గదిలో గల పరికరాలు తుప్పుపట్టాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త పరికరాలు తేవడం జరిగిందని తెలిపారు. చెత్త వాహనాలను రిపేరు చేయిస్తామని తెలిపారు. కంపల చెట్లను కూడా త్వరితగతిన తొలిగిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రతి వారము శానిటరీ ఇన్స్పెక్టర్లు షాపులపై దాడులు చేస్తున్నామని, త్వరలోనే నియంత్రిస్తామని తెలిపారు. ఇక చేపలు ఒకేచోట కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. మరి కొన్ని రోజుల్లో పట్టణాలలో ఉండే వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని తెలిపారు. డివైడర్ మధ్యలో గుంత ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు జయరాం రెడ్డి, శంషాద్ బేగం, కౌన్సిలర్లు, మున్సిపల్ ఈ సాయి కృష్ణ, డి ఈ కళావతి, కృష్ణారావు, శిరీష, టిపిఆర్ఓ విజయభాస్కర్, టిపిఓ అలివేలమ్మ, ఆర్వో అరీఫ్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు