Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి650-2, సర్వే నెంబర్ లో 76 దొంగ పట్టాలను రద్దు చేస్తాం

650-2, సర్వే నెంబర్ లో 76 దొంగ పట్టాలను రద్దు చేస్తాం

డిప్యూటీ తహసిల్దార్ సురేష్ బాబు
ముగిసిన రిలే దీక్షలు .. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలో 11 రోజులుగా సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తుదకు దీక్ష విరమణ గావించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఏఐటియుసి, కార్మిక సంఘం, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు 11,వ రోజు నిర్వహించడం జరిగింది అని తెలిపార
ధర్మవరం పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులు ఎవరైతే వున్నారో వారికీ చాలా అన్యాయం జరిగింది అని తెలిపారు. అర్హులైన కార్మికులకు పట్టాలు ఇవ్వకుండా అనర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి అర్హులైన కార్మికుల్ని రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 11,రోజులుగా ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర రిలే దీక్షలు చేస్తున్నామని,
గత మూడు నెలలుగా ధర్మవరం పట్టణంలో 650-2,సర్వే నంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది అని తెలిపారు. ర్యాలీలు, ధర్నాలు అనేక ఉద్యమాలు చేసిన ఫలిత మే ఈరోజు రెవెన్యూ అధికారులు స్పందించి కార్మికుల దగ్గరకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని, 650-2 సర్వే నెంబర్ లో అనర్హులైన వారి పట్టాలను రద్దుచేసి ఎవరైతే నిజమైన కార్మికులు ఉన్నారో వారికి వెంటనే పట్టాలు మంజూరు చేస్తామని డిప్యూటీ తాసిల్దార్ సురేష్ తెలుపుతూ రిలే దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ ,ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు, గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, ఆదినారాయణ, తాజుద్దీన్,రామకృష్ణ, రామసుబ్బయ్య,మసూద్, సురేంద్ర,నాగేంద్ర, చిన్న,జనార్దన్, వేణుగోపాల్,షెక్షావలి, గౌస్ లాజం, ఓబులేసు,మహిళా సమైక్య నాయకులు లలితమ్మ, లింగమ్మ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు