Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ..

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ..

జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; యోగా వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి యోగ ఆర్గనైజర్ యోగ మాస్టర్ నరసింహులు తెలిపారు. ఈ నెలలో 21వ తేదీన నిర్వహించబడే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు యోగా కార్యక్రమంలో భాగంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విద్యాలయం సిస్టర్ రాధా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, నేటి కాలంలో బిజీ బిజీగా నడిపే ఉద్యోగులకు, ముఖ్యంగా యువతి యువకులకు యోగా ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలందరూ కూడా యోగా కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్లు ఈశ్వర్, తిరుమలేష్, ఆర్ఎస్ఎస్ యోగా సాధకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు