. కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన
. పెండిరగ్ ప్రాజెక్టులపై దృష్టి అవసరం
. సీపీఐ కార్యదర్శి నారాయణ
విశాలాంధ్ర-తిరుపతి : బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన వెనుక కూటమి ప్రభుత్వం కుట్ర దాగి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా ఆరోపించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకుండా… పెండిరగ్లో ఉన్న అనేక కీలక ప్రాజెక్టులను పట్టించుకోకుండా… అవసరం లేని బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవనంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో లేని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఇప్పుడెందుకు మాట్లాడుతోందని నారాయణ ప్రశ్నిం చారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లోనూ, మేనిఫెస్టోలోనూ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరి నుంచి హంద్రీ-నీవాకు అనుసంధాన కాలువ, పోతిరెడ్డిపాడు వంటి కీలక ప్రాజెక్టులు పెండిరగ్లో ఉండగా… వీటిని విస్మరించి బనకచర్ల ప్రాజెక్టుపై దృష్టి సారించడం వెనుక దాగిన ఉద్దేశాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు రైతులకు మేలు చేయదని, కేవలం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థల కమీషన్ల కోసమే ఈ ప్రతి పాదనను ముందుకు తెస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ, కృష్ణా, గుంటూరు ప్రాంతాల ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేక తను ఎదుర్కోవాల్సి ఉంటుందని నారా యణ హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టు అవసరం లేదని, దీనిపై ప్రభుత్వం తక్షణం పునరాలోచన చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. పెండిరగ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా రాయలసీమలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమం, సాగుకు దోహదపడే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్ల లాభాల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టే చర్యలను అడ్డుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.