Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్రుద్రంపేట పంచాయతీ సచివాలయం వద్ద సి పి ఐ ధర్నా

రుద్రంపేట పంచాయతీ సచివాలయం వద్ద సి పి ఐ ధర్నా

విశాలాంధ్ర అనంతపురం అనంతపురం రుద్రంపేట పంచాయతీ, చంద్రబాబు నగర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు.2. సెంట్లు స్థలం ఇళ్ల నిర్మించడానికి రూ 5.లక్షలు. ఇసుక.స్టీలు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ దాదాపుగా 200 మంది.సచివాలయం రెండు వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి పంచాయతీ కార్యదర్శి హిదై తుల్లా కి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపుమేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.నగర సహాయ కార్యదర్శి అల్లిపీర నగర కార్యవర్గ సభ్యులు రామయ్య, వరలక్ష్మి, చంద్రబాబు నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి ఖాజా మొహినిద్దీన్ . సహాయ కార్యదర్శి నరసింహులు, కార్యవర్గ సభ్యులు. మదర్ సాబ్. ఆటో బాషా. మెకానిక్ నాగరాజు. సాదిక్ .సిపిఐ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు