. ఐటీ చట్టం కింద వెబ్సైట్ బ్లాక్
. నిజమైన వార్తలే అందించాం: సిబ్బంది
న్యూదిల్లీ : ప్రముఖ డిజిటల్ వార్తా సంస్థ ‘ది వైర్’పై కేంద్రం చర్యలు తీసుకుంది. వార్తా సంస్థ వెబ్సైట్ను దేశవ్యాప్తంగా నిషేధించింది. ఐటీ చట్టం`2000లోని నిబంధనల ప్రకారం ఈ మేరకు చర్యలకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ది వైర్ వెబ్సైట్ అందుబాటులో లేదని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్పీలు) ధ్రువీకరించాయి. తాజా పరిణామంపై శుక్రవారం ది వైర్ ఒక బహిరంగ ప్రకటన చేసింది. తమ సంస్థ వెబ్సైట్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లు వెల్లడిరచింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఉత్తర్వుల ప్రకారం ఈ చర్యలు తీసుకోబడ్డాయని తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, న్యాయపరంగా ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నామని ది వైర్ వెల్లడిరచింది. ఇదిలావుంటే, తామెప్పుడు నిజమైన, కచ్చితమైన వార్తలను పాఠకులకు అందించడానికి కట్టుబడినట్లు ది వైర్ సిబ్బంది చెప్పారు. తమ వార్తా సేకరణ అన్ని వేళలా వాస్తవాలాధిరతమేనని చెప్పారు. పదేళ్లకుపైగా తమకు అండగా నిలిచినందుకు వ్యూయర్స్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ది వైర్ వెబ్సైట్ను దేశవ్యాప్తంగా నిషేధించడానికి సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.