వాషింగ్టన్: అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. తాజాగా ఆయన ప్రకటించిన భారీగా దిగుమతి సుంకాల విధింపు నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ క్రమంలో భారత దేశానికి కూడా భారీగానే ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశముంది. ట్రంప్ తాజాగా రాగి (కాపర్)పై 50 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్టు ప్రకటించగా… ప్రజల మందులపై 200 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘ఈ రోజు కాపర్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాం. దీని మీద టారిఫ్ 50 శాతం ఉండేలా చేస్తాం’ అని ట్రంప్ కేబినెట్ సమావేశంలో వెల్లడిరచారు. ఆయన ప్రకటన అనంతరం కాపర్ ధరలు భారీగా పెరిగాయి. ఇక ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకారం… ఈ కొత్త సుంకం జులై చివర లేదా ఆగస్టు 1న అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కీలక ఔషధాలు, సెమీకం డక్టర్లు, లాంబర్, క్రిటికల్ మినరల్స్ వంటి వాటిపై భవిష్యత్తులో మరింత సుంకాలు విధించే అవకాశముందని సూచించారు. ఒక సంవత్సరం లోపల ఉత్పత్తిదారులు తమ కార్యకలాపాలను అమెరికాలోకి తరలించాలి. తర్వాత వారిపై 200 శాతం సుంకాలు అమలవుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇక భారత్ కాపర్ దిగుమతుల్లో అమెరికా మూడో అతిపెద్ద మార్కెట్. 2024-25లో భారత్ మొత్తం 2 బిలియన్ డాలర్ల విలువైన కాపర్, దాని ఉత్పత్తులను ఎగుమతి చేయగా… అమెరికాకు చేసిన ఎగుమతులు 360 మిలియన్ల డాలర్లుగా ఉన్నాయి. అయితే కాపర్ వాడకం ఎనర్జీ, మానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో విస్తృతంగా ఉండటంతో, అమెరికాలో డిమాండ్ తగ్గినా.. దీన్ని దేశీయ పరిశ్రమ తట్టుకునే అవకాశముంది. కానీ, అసలు ప్రభావం ఔషధ రంగంపై ఉంటుంది. అమెరికా భారత్కు అతిపెద్ద ఔషధ ఎగుమతి గమ్యం. 2025 ఆర్థికసంవత్సరంలో అమెరికాకు ఔషధ ఎగుమతులు 9.8 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది తో పోలిస్తే ఇది 21% వృద్ధి. ఇది భారత మొత్తం ఔషధ ఎగుమతుల్లో 40%. ఒకవేళ వీటిపై 200 శాతం సుంకం విధిస్తే, భారత జనరిక్ ఔషధ పరిశ్రమపై భారీ ప్రభావం ఉండనుంది. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ఒక చిన్న స్థాయి వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉంది. ఈ ఒప్పందంలో వివిధ రంగాల సుంకాల చర్చ జరుగుతోంది. ఆగస్టు 1 నాటికి ఒప్పందం పూర్తి అయితే, కొత్తగా విధించబోయే సుంకాలు భారత మార్కెట్లను ప్రభావితం చేయకుండా ఉండే అవకాశం ఉంది.
మరోసారి ట్రంప్ టారిఫ్ల మోత
- Advertisement -
RELATED ARTICLES


