కీవ్: రష్యాఉక్రెయిన్ మధ్య పోరు అంతకంతకూ తీవ్రమవుతూనే ఉండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ మరోమారు చర్చలకు ప్రతిపాదన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు లేదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి త్రైపాక్షిక చర్చలు జరిపేందుకైనా సిద్ధమన్నారు. పుతిన్తో చర్చలు ఇష్టం లేకపోయినా అందుకు సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడిరచారు. శాంతి ఒప్పందానికి రష్యా ఒప్పుకోకపోవడంపై అసహనంతో ఉన్న ఆయన... ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరారు. నిర్దిష్ట ఒప్పందాలు కుదిరితేనే: రష్యా ఉక్రెయిన్
రష్యా మధ్య నిర్ధిష్ట ఒప్పందాలు కుదిరితేనే పుతిన్, జెలెన్స్కీ సమావేశానికి అర్థం ఉంటుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడిరచారు. ఉక్రెయిన్కు సంబంధించి రష్యా రూపొందిస్తున్న ముసాయిదా పత్రం తుది దశకు చేరిందని, అందులోని అంశాలను త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. తదుపరి చర్చల నిర్ణయం వీటిపై ఆధారపడుతుందన్నారు. మీడియా ద్వారా ఈ పత్రంలోని అంశాలను క్రెమ్లిన్ చర్చించబోదన్నారు. సమన్వయం జాగ్రత్తగా జరగాలని నొక్కిచెప్పారు. ప్రత్యేక సైనిక ఆపరేషన్ ఆగదని తెలిపారు. ఉక్రెయిన్కు సంబంధించి మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి దారితీసిన అంశాలతో రష్యా ప్రయోజనాలకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని పెస్కోవ్ వెల్లడిరచారు.
త్రైపాక్షిక చర్చలకైనా సిద్ధం : జెలెన్స్కీ
RELATED ARTICLES