. ఎల్`1 సంస్థలకు నిర్మాణ బాధ్యత…పూర్తయిన టెండర్లు
. ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు
. కొత్తగా మరో 40 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్
. మంత్రి నారాయణ వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని అమరావతిలో కీలక టవర్ల నిర్మాణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతిచ్చినట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. జీఏడీ టవర్తో పాటు 1,2,3,4 టవర్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, టెండర్లలో ఎల్వన్గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు యంత్రాంగం ఆమోదం తెలిపిందన్నారు. వెలగపూడి సచివాల యంలో సీఎం చంద్రబాబు అధ్వర్యంలో ఏపీ సీఆర్డీఏ 48వ సమావేశం సోమవారం జరిగింది. అనంతరం సచివాలయం నాలుగో బ్లాక్లోని పబ్లిసిటీ సెల్లో మంత్రి నారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జీఏడీ టవర్ పనులను రూ.882 కోట్లకు ఎన్సీసీ సంస్థ, హెచ్ఓడీ టవర్లు 1,2 టెండర్లను రూ.1,487 కోట్లకు షాపూర్జీ సంస్థ, టవర్లు 3, 4 పనులను ఎల్Êటీ సంస్థ రూ.1,303 కోట్లతో దక్కించుకున్నట్లు వెల్లడిర చారు. మొత్తంగా రూ.3,673.44 కోట్లతో ఆయా టవర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రజా పరిపాలన సులువుగా ఉండేందుకు ఒకేచోట నుంచి పాలన జరిగేలా ఐదు టవర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2014-19లో రూపొందిన డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడిరచారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం తరహాలోనే అమరావతిలోనూ ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీ నిర్మించేందుకు రైతుల నుంచి భూమి సేకరించాలా లేక ల్యాండ్ పూలింగ్ చేయాలా అని గ్రామసభల్లో చర్చించి… ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్కే రైతులు మొగ్గుచూపగా… దాదాపు 24 వేల ఎకరాలను ఈ పద్ధతిలో ఇచ్చేందుకు కొందరు ముందుకు వచ్చారన్నారు. 40 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాల్సి ఉండగా… ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం 217 చ.కి.మీకే అనుమతి ఉందన్నారు. ల్యాండ్ పూలింగ్ పరిధి పెంచేందుకు ప్రస్తుతం ఆమోదం లభించిందన్నారు. విద్య, ఆరోగ్య వ్యవస్థల రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపుపై నిర్ణయం జరిగిందని చెప్పారు. రానున్న మూడేళ్లల్లో అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. అలాగే, టెండర్ల ధరలు పెంచారన్న ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు.అమరావతిపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్కు లేదని, రాజధానిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 22 మంది చీఫ్ ఇంజనీర్ల కమిటీ నిర్ణయం మేరకే ధరలు ఖరారు చేశామని నారాయణ తెలిపారు.అమరావతి అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ముందుకొచ్చిందని, గత ప్రభుత్వం అక్కడి అధికారులను ఇబ్బంది పెట్టిందన్నారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలని గతంలో అసెంబ్లీలో ప్రకటించిన జగన్ ఇప్పుడు మాట మార్చారని మంత్రి నారాయణ విమర్శించారు.