ముంబయి: భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గోల్ఫ్ జీటీఐ ధరను ఫోక్స్వ్యాగన్ నేడు ప్రకటించింది. ఐకానిక్ హాట్ హ్యాచ్ గణనీయమైన డిమాండ్ను వినియోగదారుల నుంచి అందుకుంది. విడుదలకు ముందే ఎక్కువ మంది బుక్ చేసుకుని కొనుగోలుకు ముందుకు వచ్చారు. బ్రాండ్ భారతదేశంలో తాజా ఎంకే 8.5 గోల్ఫ్ జీటీఐని రూ.52.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్బీ పరిచయ ధర) విడుదల చేసింది. ఫోక్స్వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ, గోల్ఫ్ జీటీఐ గొప్ప డ్రైవింగ్ ఆనందం, డైనమిక్ పనితీరు, స్పోర్టినెస్ల ఒక లెజెండరీ ప్యాకేజీలతో వస్తున్నదని వివరించారు. గోల్ఫ్ జీటీఐ ఎంకే 8.5 విడుదలతో, ఫోక్స్వ్యాగన్ ఇప్పుడు తన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను విస్తరించింది. దీంతో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.