. సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో పారిశుద్ధ్య నివారణ చర్యలను చేపట్టాలని కోరుతూ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎంఈఓ రమణప్పకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభమై విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్న తరుణంలో అన్ని పాఠశాలలో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు, ముఖ్యంగా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో అక్కడి యాజమాన్యాలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అపరిశుభ్రత నెలకొని విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు అన్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో ప్రవేశద్వారం సమీపంలోనే విద్యార్థులు మలమూత్ర విసర్జన చేస్తున్న కూడా అక్కడ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు, తమ పాఠశాలలో చుట్టూ పిచ్చి మొక్కలతో నిండి ఉండి విద్యార్థులు ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ పాఠశాల పరిసరాలన్నీ దుర్వాసన వస్తున్న అక్కడి పాఠశాల యజమాన్యాలు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు, విద్యార్థులతో వేలకువేలు ఫీజులు వసూలు చేస్తున్న సందర్భంలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పాఠశాల యాజమాన్యాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. అదేవిధంగా చాలా ప్రైవేట్ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు విద్యార్థులు ఆడుకోవడానికి గ్రౌండ్ సౌకర్యం కూడా లేదని విమర్శించారు, ఇదిలా ఉండగా గతంలో పట్టణంలో పేరుగాంచిన కొన్ని ప్రైవేటు పాఠశాలలో అపరిశుభ్రత నెలకొన్న నేపథ్యంలో అధికారులు ఆపాఠశాలలను పర్యవేక్షించి పరిశుభ్రత పాటించాలని నివారణ చర్యలుచేపట్టాలని ఆదేశించిన ఆపాఠశాల యాజమాన్యాలు ఏమాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు, కనుక ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కనీస సౌకర్యాలతో పాటు పరిశుభ్రత వాతావరణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు, లేనిపక్షంలో త్వరలోనే ఆయా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్యతో పాటు, స్థానిక నాయకులు ఆ దెబ్బ, తుమ్మల చిన్నప్ప ,మధు, లింగుట్ల వెంకట రాముడు, సోంపల్లి భాస్కర్, బావయ్య తదితరులు పాల్గొన్నారు.