న్యూదిల్లీ: రియల్మీ అనేది భారతీయ యువతలో అత్యధిక పేరు గాంచిన స్మార్ట్ఫోన్ బ్రాండ్. అది బుధవారంనాడు ఊహించని రియల్మీ జిటి 7 సిరీస్ను ఇండియాలో లాంచ్ చేసింది. అది పారిస్లో చేసిన గ్లోబల్ లాంచ్తో సింక్ అయి ఉంటుంది. రియల్మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్ను ఆస్టన్ మార్టిన్ ఫార్ములా వన్ టీమ్తో కలిసి సృష్టించింది. ఏఎంఎఫ్ 1 సహ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్గా పరిచయం చేసింది. ఇండియాలో మీడియా టెక్ డిమెన్సిటీ 9400ఈని అందించే తొలి భారతీయ ఫోన్ ఇదేనని మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్లకు మీడియా టెక్ డైరెక్టర్ అనుజ్ సిద్దార్ధ్ అన్నారు. రియల్మీ జిటి 7కు 7000ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీతో పాటు120డబ్ల్యు ఆల్ట్రా చార్జ్ కూడా ఉంటుంది. అది కేవలం 14 నిమిషాలలో 50% శక్తిని అందిస్తుంది. 40 నిమిషాలలో 100%ని అందిస్తుంది. 8జీబీం256జీబీ, 12జీబీం256జీబీ, 12జీబీం512జీబీ కాన్ఫిగరేషన్లలో, రూ.28,999 నుంచి మొదలవుతుంది. మొదటి అమ్మకం 30, మే 2025 మధ్యాహ్నం 12 నుంచి మొదలవుతుంది.