Monday, June 23, 2025
Homeవిశాలాంధ్ర 73వ వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర 73వ వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – పార్వతీపురం: తెలుగు రాష్ట్రాల్లో అణగారిన వర్గాల ప్రజలకోసం, కార్మిక, కర్షక, అసంఘటిత రంగాల వర్గాల కోసం అనునిత్యం కృషి చేస్తూ, సామాజిక సమస్యలపై స్పందిస్తున్న విశాలాంధ్ర దినపత్రిక 73వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందాయకమని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. విశాలాంధ్ర దిన పత్రిక 73వ వార్షికోత్సవ వేడుకలను జిల్లా కలెక్టరేట్ పిజిఅర్ఎస్ కార్యాలయంలో నిర్వహించగా, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా విశాలాంధ్ర పత్రికను నడపడం అభినందనీయమన్నారు. పేదల పక్షాన నిలిచే పత్రికగా విశాలాంధ్ర దినపత్రిక పేరుగాంచినదన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ రాబర్ట్ పాల్, డిఆర్ డిఏ పిడి సుధారాణి,జిల్లా పౌర సంబంధాలఅధికారి ఎల్ రమేష్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజ్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగన్మోహన రావు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, జిల్లా విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ మంతిని రమేష్ తదితర జిల్లా అధికారులు, డిపిఆర్ఓ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, కార్యాలయసిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు