విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రభుత్వ వైద్యారోగ్యశాఖలో 4500 ఉద్యోగాలు కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీజేశారు. అర్బన్ ప్రాంతంలోని కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్లు 560 పోస్టులు (కాంట్రాక్టు), స్టాఫ్ నర్స్ (కాంట్రాక్టు) 1120, లాబ్ టెక్నీషియన్లు (కాంట్రాక్టు), ఫార్మాసిస్ట్ (కాంట్రాక్టు), డీఈవో(అవుట్ సోర్సింగ్), శానిటరీ అటెండెంట్/ఎల్జీఎస్ (అవుట్ సోర్సింగ్) పోస్టులున్నాయి. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.61,960 వేతనం, స్టాఫ్ నర్సులకు రూ.27,675, ల్యాబ్ టెక్నిషియన్లకు రూ.23,393, ఫార్మాసిస్టులకు రూ.23,393, డీఈవోలకు రూ.18,450, శానిటరీ అటెండెంట్కు రూ.15 వేల చొప్పున నెలవారీ వేతనం ఆయా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పోస్టులకు అనుగుణంగా వేతనం కేటాయించారు.