Homeజాతీయంబీమా రంగంలోకి 100శాతం ఎఫ్‌డీఐ

బీమా రంగంలోకి 100శాతం ఎఫ్‌డీఐ

- Advertisement -

: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
లోక్‌సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా చట్టాల (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. సబ్కా బీమా – సబ్కీ రక్షా అనే పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లులో, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరిమితిని ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
ఈ బిల్లు ద్వారా పాలసీదారుల రక్షణను మరింత బలపరచడం, దేశవ్యాప్తంగా బీమా విస్తరణను పెంచడం, అలాగే బీమా రంగం వేగంగా అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యమని మంత్రి చెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన 2047 నాటికి అందరికీ బీమాఁ లక్ష్యానికి అనుగుణంగా ఈ సవరణలు రూపొందించామన్నారు.

స్థిరమైన విదేశీ మూలధనం దేశంలోకి..
బీమా చట్టాల సవరణ బిల్లు-2025 కింద బీమా చట్టం-1938, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం-1956, అలాగే ఐఆర్‌డీఏఐ చట్టం-1999లను సవరించనున్నారు.ఈ మార్పులు బీమా రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికీ, దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికీ ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.బీమా రంగంలో 100 శాతం (FDI)కి అనుమతి ఇవ్వడం వల్ల స్థిరమైన విదేశీ మూలధనం దేశంలోకి రానుందని, కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, అలాగే సామాజిక భద్రత పరిధి మరింత విస్తరిస్తుందని ఆమె వివరించారు.దీనితో పాటు పాలసీదారుల అవగాహన పెంచేందుకు, వారి హక్కులను కాపాడేందుకు పాలసీదారుల విద్యా-రక్షణ నిధి ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.

విదేశీ కార్యకలాపాల సమన్వయానికి వీలు
అక్రమంగా లేదా అన్యాయంగా లాభాలు పొందిన బీమా సంస్థలు, మధ్యవర్తుల నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారాలను ఐఆర్‌డీఏఐకి ఇవ్వాలని కూడా ఈ బిల్లు సూచిస్తోంది.
అలాగే బీమా రంగంలో డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలకు చట్టబద్ధమైన రూపకల్పన చేసి, పాలసీదారుల డేటా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.వ్యాపార సౌలభ్యం కోసం బీమా మధ్యవర్తులకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకురానున్నారు.
దీనివల్ల కస్టమర్లకు నిరంతర సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీకి మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ, జోనల్ కార్యాలయాల ఏర్పాటు, విదేశీ కార్యకలాపాల సమన్వయానికి వీలు కల్పించనున్నారు.

బీమా భద్రతలోకి పౌరులు
ఇక బీమా కంపెనీల్లో షేర్ల బదిలీకి ఐఆర్‌డీఏఐ అనుమతి తీసుకోవాల్సిన పరిమితిని ప్రస్తుతం ఉన్న 1 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.ఈ బిల్లు అమలులోకి వస్తే బీమా పరిధి మరింత విస్తరించి, ఎక్కువ మంది పౌరులు బీమా భద్రతలోకి వస్తారని అంచనా వేస్తున్నారు.అదేవిధంగా ఐఆర్‌డీఏఐ చట్టం కింద నిబంధనలు రూపొందించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ప్రవేశపెట్టాలని కూడా బిల్లు సూచిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు