Homeజాతీయంఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ ఏడాది 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి

ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ ఏడాది 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి

- Advertisement -

టెక్నాలజీ దిగ్గజం ఆల్ఫాబెట్ నేతృత్వంలోని గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. తమ ఏఐ మోడళ్లను ఉపయోగించి ప్రతి నెలా 85 లక్షల మందికి పైగా డెవలపర్లు యాప్స్, ఇతర సేవలను రూపొందిస్తున్నారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, ఈ ఏడాది క్యాపిటల్ వ్యయం సుమారు 190 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నిధులను ప్రధానంగా ఏఐ డేటా సెంటర్లు, కస్టమ్ సిలికాన్, మోడల్ ట్రైనింగ్ కోసం కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.

డెవలపర్లు, ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు సాధారణ వినియోగదారుల నుంచి కూడా తమ ఏఐ సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని పిచాయ్ వివరించారు. గూగుల్ జెమిని యాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య గతేడాదితో పోలిస్తే రెట్టింపు అయి, ప్రస్తుతం 90 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అలాగే, ఏఐ ఓవర్‌వ్యూస్ ఫీచర్‌ను నెలకు 250 కోట్ల మంది, ఏఐ మోడ్‌ను 100 కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా పలు కొత్త ఏఐ టూల్స్‌ను, అప్‌గ్రేడ్లను కూడా గూగుల్ పరిచయం చేసింది. వీటిలో కోడింగ్, వర్క్‌ఫ్లోల కోసం వేగవంతమైన ఃజెమిని 3.5 ఫ్లాష్ః మోడల్, యూజర్ల తరఫున పనులు పూర్తిచేసే పర్సనల్ ఏఐ ఏజెంట్ ఃజెమిని స్పార్క్ః ఉన్నాయి. దీంతో పాటు యూట్యూబ్‌లో సంభాషణల ద్వారా వీడియోల్లోని కీలకమైన క్షణాలను కనుగొనడానికి ఃఆస్క్ యూట్యూబ్ః అనే కొత్త ఫీచర్‌ను, వాయిస్ కమాండ్స్‌తో డాక్యుమెంట్లు సృష్టించేందుకు ఃడాక్స్ లైవ్ఃను కూడా ఆవిష్కరించింది.

ఏఐ శిక్షణ, కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తమ సరికొత్త తరం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను (టీపీయూ) కూడా అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఏఐ అత్యంత కీలకమైన టెక్నాలజీ అని పిచాయ్ తెలిపారు. ఏఐ కంటెంట్ పారదర్శకతలో భాగంగా ఃసింథ్ఐడీః అనే వాటర్‌మార్కింగ్ టెక్నాలజీని మరింత విస్తరిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్‌ను గుర్తించేందుకు ఓపెన్‌ఏఐ, కకావో వంటి సంస్థలు కూడా ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు