- Advertisement -
9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి
భద్రాచలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి చెందారు. ఈనెల ఆరో తేదీన తీర్థయాత్రల కోసం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వీరు చిత్తూరు నుంచి బయలుదేరారు. శుక్రవారం వేకుజామున భద్రాచలం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయల పడింది ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.


