Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివ్యాపార సముదాయాలను కూల తోయడం మంచి పద్ధతి కాదు..

వ్యాపార సముదాయాలను కూల తోయడం మంచి పద్ధతి కాదు..

పట్టణ వ్యాపారస్తులు ఆందోళన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మున్సిపల్ అధికారులు వ్యాపార దుకాణాలకు కనీసం సమాచారం ఇవ్వకుండా దుకాణాల ముందు మురికి కాలువల క్లీనింగ్ పేరిట వ్యాపార సముదాయాలను కూలదోయడం మంచి పద్ధతి కాదని తెలుపుతూ పట్టణ వ్యాపారస్తులు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ కు విజ్ఞప్తి చేయగా, వారి సమస్యలను పట్టణ అధ్యక్షులు పరిటాల శ్రీరామ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు తమ గోడును విన్నవిస్తూ వ్యాపార సముదాయాల వారిని బెదిరించి, వ్యాపార సముదాయాలను కొట్టివేసి వ్యాపారులకు ఇబ్బంది కలిగించడం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. వ్యాపారాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. మురికి కాలువలు క్లీనింగ్ పేరిట మున్సిపల్ అధికారులు ఇష్టానుసారం వ్యాపార సముదాయాల ముందు జెసిపి తో కొట్టివేస్తున్నారని, దీనివల్ల మాకు వ్యాపారాలు జరగడం లేదని, నెలవారి బాడీగా కట్టుకోవడానికి కూడా సొంత డబ్బు వాడాల్సిన పరిస్థితి ఏర్పడడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఒక్కొక్క షాపుకు 50 వేల రూపాయల మేరకు ఖర్చు అవుతుందని తెలిపారు. గత 15 రోజులుగా వ్యాపారాలు లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ పరిటాల శ్రీరామ్కు పట్టణ వ్యాపారస్తుల సమస్యలను పూర్తిగా వివరించడం జరిగింది. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పట్టణ వ్యాపారస్తులతో తాను తప్పక కలిసి చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని వారు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు