Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచిత్రావతి నదిలో అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ శాఖ తనిఖీలు..

చిత్రావతి నదిలో అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ శాఖ తనిఖీలు..

9 టిప్పర్ లారీలు, 3 ట్రాక్టర్లపై జరిమానాలు

– అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. ఆర్డీవో మహేష్.
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిత్రావతి నది ఒడ్డున అక్రమ ఇసుక తవ్వకం మరియు అక్రమ రవాణాపై అధికారులు తీవ్ర నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ఉదయం, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో ఉప్పలపాడు , పిసిరేవు, సీసీరేవు పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, సాండ్ రీచ్ అనుమతులు ఉన్న ప్రాంతంలో కాకుండా అనుమతులు లేని ప్రాంతలో ఇసుకను తరలిస్తున్న 9 టిప్పర్ లారీలు, 3 ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. ఈ వాహనాలపై భారి జరిమానాలు విధించబడ్డాయి. అనంతరం ఆర్డిఓ మాట్లాడుతూ“ఇలాంటి అక్రమ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుని, ఇటువంటి చర్యలు పునరావృతమైతే సంబంధిత వాహనాలను జప్తు చేసి, సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ మరియు రెవెన్యూ శాఖలు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు