టోక్యో: జపాన్కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ చేపట్టిన మూన్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టేందుకు ‘ఐస్పేస్’ అనే సంస్థ ఈ మిషన్ను చేపట్టింది. జాబిల్లిపై దిగే సమయంలో ‘రెసిలెన్స్’ ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రయోగం విఫలమైంది. ఈనెల 6వ తేదీ ఉదయం 8 గంటలకు ల్యాండర్తో సంబంధాలు తెగిపోయినట్లు ఐస్పేస్ మిషన్ కంట్రోలర్లు వెల్లడిరచారు. వాటిని పునరుద్ధరించడం సాధ్యం కాదన్నారు. అయిలే అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడిరచారు. ల్యాండర్ను జనవరిలో స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుంచి ప్రయోగించారు. ఐదు నెలల పాటు ప్రయాణించిన ఈ వ్యోమనౌక మేలో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రణాళిక ప్రకారం జాబిల్లి ఉపరితలంపై ఉన్న ‘మేర్ ఫ్రిగోరిస్’ అనే పాయింట్ వద్ద ఈ ల్యాండర్ దిగాలి. కానీ కక్ష్య నుంచి విడిపోయి గమ్యస్థానానికి వెళ్లిన తర్వాత ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయి. ఐస్పేస్ 2023లో జాబిల్లి యాత్ర చేపట్టి విఫలమైంది. తాజాగా రెండో ప్రయత్నం ఫలించలేదు.