మురికి కాలువల నందు ఉన్న మట్టిని పూర్తిస్థాయిలో తీసివేయాలి
పరిటాలశ్రీరామ్ పరిశీలనతో కదిలిన మున్సిపల్ అధికార యంత్రాంగం
దెబ్బతిన్న మురికి కాలువలను ప్రభుత్వమే నిర్మిస్తుందిబిమున్సిపల్ కమిషనర్
విశాలాంధ్ర ధర్మవరం: గత ఐదు రోజుల క్రితం ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణంలో మున్సిపల్ అధికారులు వ్యాపార సముదాయాల ముందు తొలగించిన మురిక కాలువల శిథిలాలను పరిశీలించగా స్థానిక వ్యాపారస్తులు వ్యాపార సముదాయాల ముందు మురికి కాలువలను నిర్మించాలని కోరగా పరిటాల శ్రీరామ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే పరిటాల శ్రీరామ్ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన మున్సిపల్ కమిషనర్ తెదేపా నాయకులతో కలిసి కమిషనర్ ప్రమోద్ కుమార్ మున్సిపల్ అధికారులైన డి.ఈ వీరేష్ , శ్యానిటరీ ఇన్స్పెక్టర్ శామ్సన్,కేశవులను వెంటబెట్టుకుని పట్టణంలో వ్యాపార సముదాయాల ముందు తొలగించిన శిబిరాలను దెబ్బతిన్న డ్రైన్సును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాల ముందు పెద్ద ఎత్తున నిల్వ ఉన్న చెత్తను మురికి కాలువలు బ్లాక్ అయిన వాటిని స్థానిక తెదేపా నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే దెబ్బతిన్న మురికి కాలువలను నిర్మించడంతోపాటు శ్రీదేవి హాల్ వద్ద కల్వర్టును నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కమిషన్ దృష్టికి తెదేపా నాయకులు తీసుకువెళ్లారు. తక్షణమే అందుకు సంబంధించిన ఎస్టిమేషన్స్ రెడీ చేయాలని డి.ఈ వీరేష్ కుమున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశించారు. పట్టణంలో మూడు రోజుల్లో వ్యాపార సముదాయాల ముందు తొలగించిన చెత్తను తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ తెదేపా నాయకులకు హామీ ఇచ్చారూ. దీంతో పట్టణ వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీ వారికి, మున్సిపల్ కమిషనర్ కు హామీ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.