Monday, June 9, 2025
Homeఆంధ్రప్రదేశ్శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదికలో భాగస్వాములుకండి

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదికలో భాగస్వాములుకండి

జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆది శేషు
విశాలాంధ్ర ధర్మవరం : శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వాములు కావాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాటికి సంబంధించిన సభ్యత్వ గోడపత్రికలను బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని శ్రీ సత్య చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర జేవీవీ నాయకులు విడుదల చేసారు.ఈ సంధర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, కోశాధికారి చంద్రశేఖర రెడ్డి , ప్రముఖ చిన్నపిల్లల వైదుడు డాక్టర్ విక్రాంత్, ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ బాబు మట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 38 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించాలని మానవత్వంతో జీవించాలని ఆకాంక్షిస్తూ శాస్త్ర ప్రచారంతో ప్రజలను చైతన్యం చేస్తోందన్నారు.నేడు ధర్మా ధర్మముల మధ్య, సత్యా సత్యముల మధ్య ఘర్షణ జరుగుతున్నది అని తెలిపారు. ఈ ఘర్షణలో బుద్ధి జీవులు ఏ పక్షం వహించాలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అని తెలిపారు. చివరకు జ్ఞానం, అజ్ఞానాన్ని సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి అని తెలిపారు. 100 సంవత్సరాల క్రితమే కందుకూరి వీరేశలింగం పంతులు అన్నాడని తెలిపారు. పోరాటం ఈనాటికీ కొనసాగుతూనే ఉందన్నారు. జీవుల జన్యు నిర్మాణం గురించి వచ్చే రోగాల గురించి వాటి చికిత్స గురించి ఎంతో ముందుకు వెళ్ళాము కానీ ఇంకా మన సమాజంలో అశాస్త్రీయ భావజాలం రాజ్యమేలుతూనే ఉందన్నారు. దీనికి సైన్సు అందిస్తున్న ఫలితాలు సామాన్యుని వద్దకు చేరకపోవడమేనన్నారు. సైన్సు ఇప్పటికీ పాఠ్య గ్రంథాలలో ఉంది తప్ప జీవన విధానంగా మారలేదన్నారు.సైన్స్ అవగాహన పెంచడం ద్వారా సామాన్యులు సైన్స్ ఫలితాలను అందుకోవాలనే ఆలోచనలో నుంచి రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక ఏర్పడిందన్నారు. మనం చేసే శాస్త్రీయ ఆలోచన క్రమాన్ని ఆటంకపరచే శక్తులు అడ్డుకునే శక్తులు సామాజిక వ్యవస్థలో ఉన్నాయన్నారు. అలాంటి హేతు విరుద్ధ శక్తుల పట్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసే కర్తవ్యం జనవిజ్ఞాన వేదిక చేస్తున్నదన్నారు.అనేక రంగాలలో మునుపెన్నడూ ఊహించని ఆవిష్కరణలతో శాస్త్ర విజ్ఞానం దూస్సుకుపోతున్నా, మధ్యయుగాల చాందస సంకుచిత భావాలు ప్రజానీకాన్ని విజ్ఞాన ఫలాలను అందుకోనీయకుండా చేస్తున్నాయన్నారు. ప్రజలకు చేరువగా, ప్రజల కోసం విజ్ఞాన ఫలాలు ఉపయోగపడాలని జనవిజ్ఞాన వేదిక ఆకాంక్షిస్తోందన్నారు.తెలుగు ప్రజల్లో పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థగా జనవిజ్ఞాన వేదిక అందరి అభిమానాన్ని పొందగలిగిందన్నారు.అక్షరాస్యత ,సారా వ్యతిరేక ఉద్యమం, కూల్ డ్రింక్స్ వ్యతిరేక ప్రచారం ,ఆరోగ్య ప్రచారం ,పిల్లల్లో సృజనాత్మకత కోసం ప్రయత్నాలు, పర్యావరణం వంటి అంశాలతో పాటు పిల్లలకు సైన్సు పట్ల అభిరుచి పెంచేందుకు చెకుముకి పత్రికను నిర్వహిస్తున్నదన్నారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించుకునే శక్తి మనిషికే ఉందన్నారు.ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా సమాజంలోనే ఉన్నాయన్నారు. సామాజిక అంశాల విశ్లేషణ, అధ్యయనాలను శాస్త్రీయ హేతువాద దృక్పథంతో చేసే ఆలోచనని ప్రజానీకంలో ప్రోది చేయాలన్న ఆశయంతో పని చేసే ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థ జనవిజ్ఞాన వేదికలో సభ్యులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఒక ఉన్నతమైన శాస్త్రీయ సమాజ కోసం ప్రజాసైన్స్ ఉద్యమానికి తోడ్పాటు అందించాల్సిందిగా కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు సురేష్, నరేంద్ర బాబు, నాగేంద్ర, ఖలందర్, మల్లికార్జున, మనోహర్, జంగమన్న, వినయ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు