Monday, June 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాంస్య పథకం సాధించిన సత్యసాయి జిల్లామహిళల హాకీ జట్టు

కాంస్య పథకం సాధించిన సత్యసాయి జిల్లామహిళల హాకీ జట్టు

విశాలాంధ్ర ధర్మవరం; హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భీమవరం లో గత మూడు రోజు లుగా జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీలలో సత్యసాయి జిల్లా జట్టు కాంస్య సాధిం చింది అని కోచ్ మారుతి కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శుక్రవారం జరిగిన మొదటి లీగ్ మ్యాచ్ లో నంద్యాల జిల్లా జట్టుపై 16-0, రెండవరోజు నెల్లూరు జిల్లా జట్టుపై 11-0తిరుపతి జిల్లా జట్టుపై 3-1స్కోరుతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకుంది అని తెలిపారు. సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతపురం జిల్లా జట్టుతో తలపడి నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1 గోల్స్ తో డ్రాగా ముగిసింది అని తెలిపారు. అనంతరం పెనాల్టీ షూట్ అవుట్ లో 3-2 గోల్స్ తేడాతో ఓటమి చెందింది అని తెలిపారు. మూడవ స్థానం కోసం ప్రకాశంజిల్లా సత్యసాయి జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచులో 2-0 గోల్స్ తేడాతో గెలుపొంది తృతీయ స్థానం దక్కించుకుంది అని తెలిపారు. తృతీయ స్థానం సాధించిన సత్యసాయి
జిల్లా జట్టుకు ఎమ్మెల్సీ మోషేను రాజు ,హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్ తదితరులు బహుమతులను అంద చేసారు. సత్యసాయి జిల్లాకు చెందిన హేమ బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకుంది అని తెలిపారు. విజయం సాధించిన జట్టు సభ్యులను, హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్యప్రకాష్
బీ.వీ.శ్రీనివాసులు,బండి వేణుగోపాల్,పళ్లెం వేణుగోపాల్, అంజన్న, గౌరిప్రసాద్, సత్య సాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ కోచ్ హస్సేన్, మేనేజర్ అరవింద్ గౌడ్, సీనియర్ క్రీడాకారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు