జాయింట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మకు వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి జి.సంతోష్ కుమార్
విశాలాంధ్ర అనంతపురం : ఐపీఎల్ యువతను బలి చేస్తున్న బెట్టింగ్ యాప్ల ను అరికట్టాలని ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలోఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి జి.సంతోష్ కుమార్ సోమవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి జి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ..“ఐపీఎల్ పేరుతో కార్పొరేట్ సంస్థలు, సెలబ్రిటీలు యువతపై మానసిక, ఆర్థిక దాడి చేస్తున్న దుర్మార్గానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. . క్రీడలు సమాజంలో సానుకూల భావజాల ఏర్పడేందుకు పనికొస్తాయి అన్నారు. ఇప్పుడు అవి వ్యాపార వ్యసనాల కేంద్రాలుగా మారిపోయాయి అన్నారు. ఈ బెట్టింగ్ యాప్ ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు యువకులు బెట్టింగ్ ఆడి అప్పులు తీసుకొని, కట్టలేక ఆత్మహత్యలు పాలవుతున్నా అనేక సందర్భాలు చూస్తున్నామన్నారు. యువతను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలనీ. లేకపోతే ఏఐవైఎఫ్ యువతతో కలిసి ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలు, క్రీడాకారులపై నియంత్రణ విధించాలనీ.యువతలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించాలన్నారు. కార్పొరేట్ ఫ్రాంచైజీలకు బెట్టింగ్ యాప్లతో సంబంధాలపై విచారణ జరిపి నివేదిక రూపొందించాలనీ జిల్లా యంత్రాంగం, యువజన సంఘాలతో కలిసి ప్రత్యేక సమాలోచన సమావేశాలు నిర్వహించాలి. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, శ్రీనివాస్ నగర సహాయ కార్యదర్శి సురేంద్ర, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు..