Monday, June 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి పల్లి లో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం కేసులో నిందితులు...

రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి పల్లి లో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం కేసులో నిందితులు అరెస్టు…

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడి
విశాలాంధ్ర- రామగిరి/పుట్టపర్తి/ధర్మవరం డివిజన్; శ్రీసత్య సాయి జిల్లా, రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి గ్రామంలో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి.రత్న వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ తో కలిసి కేసు వివరాలను విలేకరుల సమావేశంలో తెలియజేశారు . అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం సబ్ డివిసనల్ పోలీస్ అధికారి అయిన B.హేమంత్ కుమార్ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు.అరెస్టైన నిందితులు లో
,అచ్చంపల్లి వర్ధన్ రామగిరి మండలం.తలారి మురళి,బి.సి.కాలనీ, పేరూరు గ్రామం, రామగిరి మండలం.బడగోర్ల నందవర్ధన్ రాజ్ @ నందా, ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం,అరెంచేరు నాగరాజు,ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం, బోయ సంజీవ,ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం.,బుడిదా రాజన్న, ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం లో నివసించేవారని తెలిపారు.నిందితులను సోమవారం రోజున అరెస్టు చేయడం జరిగినది అని తెలిపారు. తదుపరి కేసు వివరాలను తెలుపుతూ
సత్య సాయి జిల్లాలో 15 ఏళ్ల బాలికపై 6 వ్యక్తులు వేరు వేరుగా వివిధ సమయాలలో శారీరక దాడులు చేసి అత్యాచారం చేసిన ఘటనలో, పోలీసులు కఠిన చర్యలు తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు అని తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి, వర్ధన్, గిరి, రాజేష్, అంజి, మురళి, హేమంత్, కార్తీక్ తోపాటు కొంత మంది నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. పోలీసుల సమర్థమైన చర్యలతో ఈ ఘటనపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది అని తెలిపారు.ఈ కేసులోని నిందితులపై మరింత కఠినమైన కేసులు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఇందులో కొంతమంది నిందితులు ఇంతకు పూర్వం మైనర్ బాలికలు గర్భాలు తీయించినట్లు, సమాచారం ఉందని ఫిర్యాదు చేయడానికి పోలీసుల వద్దకు వెల్లనీయకుండా ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం అని తెలిపారు. దాని మీద కూడా సమగ్ర మైన దర్యాప్తు చేపట్టామన్నారు.
ఈ ఘటనపై మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ధర్మవరం డిఎస్పి పర్యవేక్షణలో, రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బృందాలు శ్రమించి, నిందితులను గుర్తించి, అరెస్టు చేయడం జరిగింది అని తెలిపారు. మిగిలిన ముద్దాయిల అరెస్టు కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి అతి త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. మహిళలు చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్, రామగిరి సిఐ శ్రీధర్, ధర్మవరం టూ టౌన్ సిఐ రెడ్డప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు