ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించింది. ఇలా ఇరు పక్షాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. బుధవారం జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది ఇరానీయులు చనిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు వెల్లడించాయి. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో జెరూసలెంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసని.. కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదని చెప్పారు. ప్రస్తుతానికి లొంగిపోతే మంచిదని.. లేదంటే పరిణామాలైతే తీవ్రంగా ఉంటాయని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఖమేనీ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో కీలక పోస్ట్ చేశారు. ాాయుద్ధం మొదలైంది అంటూ పోస్టు చేశారు. ఇక కనికరించం అంటూ రాసుకొచ్చారు. ాానమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో కలిసి ఖైబర్కు వచ్చేశారు్ణ్ణ అని అందులో రాశారు. అంతేకాకుండా ఖడ్గం పట్టుకుని కోట గేటు దగ్గర ఓ వ్యక్తి ఉన్న ఫొటోను కూడా జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా కనిపిస్తోంది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తర్వాత దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది.