రజక శిరీష పై దాడి సిగ్గు చేటు …
రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య
విశాలాంధ్ర -అనంతపురం : రజక వృత్తిదారులకు భద్రత కల్పించాలని, రజక శిరీష పై దాడి సిగ్గు చేటు అని రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో రజక శిరీష పై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులపై రజక శిరీష అనేమహిళలపై నిన్నట రోజు కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో అర్థ చేసిన అప్పు 80 వేల రూపాయలు కట్టాలని రజక మహిళ శిరీషను చెట్టుకు కట్టేసి కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. ఇలాంటి ఆకృత్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. నేడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో ఒక రజక మహిళను చెట్టు కట్టి తీవ్రంగా హింసించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు అగ్రవర్ణాలకు జరిగి ఉంటే ఈపాటికి రాష్ట్రమంతా కూడా అల్లాడిపోయేది అన్నారు. అదే రజకులకు ఎస్సీ హోదా ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పటిష్టమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ద్వారా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని రజకులపై దాడులు చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడేది అన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఎస్సి హోదా గుర్తుకొస్తుందన్నారు . తిరిగి ఎన్నికల ముందు కమిటీ వేస్తారు అది నిర్వీర్యం అయిపోతోందన్నారు. ఇదంతా ఒకపక్క ప్రణాళికతో రజకుల నాలుగు శాతం ఓట్లు దండుకొని రజకులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బంగారు భాష, రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి. నాగప్ప, గీత పని వాళ్ళ సంఘం జిల్లా కార్యదర్శి రఘు, రజక వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు టిసి భూషణ, రజకగౌరవ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, రజక వృత్తిదాల సమాఖ్య జిల్లా నాయకులు సి. రాజు, సత్యనారాయణ, పాండు, మల్ రాయుడు, నాగరాజు, శీను, నరసింహులు, మారుతి తదితరులు పాల్గొన్నారు.