Saturday, June 21, 2025
Homeజిల్లాలునెల్లూరుకూటమి ప్రభుత్వ ఏడాది పాలనబీసీ లకు స్వర్ణయుగం----

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనబీసీ లకు స్వర్ణయుగం—-

డాక్టర్ జడ్ శివప్రసాద్
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: పెన్షన్లు పెంపు, తల్లికి వందనం పథకాల లబ్ధిదారులలో సింహభాగం బీసీలదే, నామినేటెడ్ పదవులు, చట్ట సభలు, స్థానిక సంస్థలురంగం ఏదైనా కూటమి ప్రభుత్వం లో బీసీ లదే అగ్ర తాంబూలం ఇచ్చిందని రాష్ట్రఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డ్ చైర్మన్ డా!! జడ్. శివప్రసాద్
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారుబీసీ లపై దాడులు చేయాలంటే వణుకు పుట్టేలా బీసీ రక్షణ చట్టం విధివిధానాలను రూపుదిద్దుతోంది కూటమి ప్రభుత్వం.2025-26 రాష్ట్ర బడ్జెట్ లో 47,457 కోట్ల రూపాయలను బీసీ ల అభివృద్ధి కి కేటాయించింది శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కేబినెట్ లోని 8 మంది మంత్రులు,38 మంది శాసన సభ్యులు బీసీ లే. 2014-19 టిడిపి ప్రభుత్వ హయాంలో 3700 కోట్ల రూపాయలను బీసీ కార్పొరేషన్ ల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు చేసింది. నేటి కూటమి పాలన లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.గత వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ లకు నిధులు నిలిపివేసింది, సబ్సిడీ రుణాలను రద్దు చేసింది. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది.స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ లను 20 నుండి 34 శాతం పెంచిన టిడిపి నేడు చట్ట సభల్లో బీసీ లకు 33 శాతం రిజర్వేషన్ ల అమలు కు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. చేతి వృత్తులపై ఆధారపడిన 4.2 లక్షల మంది పేద బీసీ లకు ఆదరణ పథకం ద్వారా అత్యాధునిక పరికరాలు అందించిన టిడిపి ప్రభుత్వం నేడు ఆదరణ -3 పథకం కు ప్రతీ యేటా 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తోంది.గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం కేటాయించింది కూటమి ప్రభుత్వం. స్వర్ణ కారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.20 లక్షల మంది మత్స్యకారుల ఉపాధి ని దెబ్బ తీసే జీవో 217 ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఁమత్స్యకారుల సేవలో ఁ పథకం కింద వేట నిషేధకాల భృతి రూ. 20 వేలకు పెంచిన ఘనతకూటమిప్రభుత్వానిదే.దేవాలయాల లో నాయీ బ్రాహ్మణుల వేతనాలను 25 వేల రూపాయలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. బీసీ లంటే వెనుకబడిన వర్గాలు కాదు, దేశానికే వెన్నెముక లాంటి వారని గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు ఈ సమావేశంలో ఉమ్మడినెల్లూరు జిల్లాకు చెందిన పలువురు బీసీ సంఘానికి నాయకులు తెలుగుదేశం పార్టీ బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు