Saturday, June 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికులాంతర వివాహానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ భద్రత

కులాంతర వివాహానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ భద్రత

లాయర్ సుమలత.
విశాలాంధ్ర ధర్మవరం;; కులాంతర వివాహానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ భద్రత ఇస్తుందని, అదేవిధంగా చట్ట ప్రకారం ఈ జంటకు భద్రత తో పాటు వారి హక్కులకు న్యాయం చేకూర్చడం జరుగుతుందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ లాయర్ సుమలత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రి కు చెందిన టి. కళ్యాణి, తదుపరి జే. శివప్రసాద్ అను అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహమును కర్నూలు జిల్లా కొమ్మ చెరువు గ్రామములోని ఆంజనేయ స్వామి దేవాలయములో మా ఇష్టపూర్వకంగా కులాంతర వివాహం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. మాకు మా తల్లిదండ్రుల నుంచి హాని ఉంది అని తెలిపారు. దీంతోపాటు అనంతపురం జిల్లా ఎస్పీ తో పాటు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు మాకు రక్షణ కల్పించాలని వారు కోరడం జరిగిందన్నారు. కళ్యాణి భర్త శివప్రసాద్ కుటుంబాన్ని, నా భర్త స్నేహితులందరినీ గత పది రోజులుగా తాడిపత్రి సీఐ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఎస్పీ, మానవ హక్కుల చట్టం సంఘాలు ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలపాలని వారు కోరడం జరిగిందన్నారు. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కళ్యాణి, శివ ప్రసాద్ అను మేము కలసి ఆత్మహత్య చేసుకుంటామని వారు స్పష్టం చేయడం జరిగిందన్నారు. దీనికి బాధ్యులు మా కుటుంబ సభ్యులే అని కూడా తెలపడం జరిగిందన్నారు. ఈ విషయమై లాయర్ గా తాను ఎస్పీ, తాడిపత్రి సిఐతో చర్చించి కులాంతర వివాహం చేసుకున్న జంటకు న్యాయం జరిగేటట్లు చూడటం జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు