Saturday, June 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసిపిఐ జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్.

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య

చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు.
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో జూలై 31, ఆగస్టు ఒకటవ తేదీన నిర్వహించబోయే సిపిఐ జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య, చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, ధర్మవరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా
పట్టణంలో ఎన్జీవోస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ,శ్రీనివాసులు,చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి , చెన్నంపల్లి శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కుళ్లాయప్ప, బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్,ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం గోవిందరాజులు, లక్ష్మీనారాయణ, తాజ్, ఆంజనేయులు , మసూద్,మహిళా సమైక్య లలితమ్మ , లింగమ్మ ,ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ళ ఘన చరిత్ర కలిగిన పార్టీ 1925 డిసెంబరు 26న కాన్పూర్ లో స్థాపించబడిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఈ ఏడాది తో వందేళ్లు పూర్తి అవుతున్నది అని తెలిపారు. సింగారు వేలు చిట్టియార్ కార్యదర్శి గా ఘాటే అధ్యక్షుడిగా తొలిసారిగా కాన్పూర్లో ప్రారంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ సోషలిజం స్థాపనే ధేయంగా కష్ట జీవుల రాజ్యము రావాలనే లక్ష్యంతో ప్రారంభించబడినది అని తెలిపారు.నాటి నుంచి నేటి వరకు భారత దేశంలో అనేక పోరాటాలు చేసిన పార్టీ అని వేరే చెప్పనవసరం లేదు అని, సిపిఐ పోరాట ఫలితంగా దేశంలో అనేక చట్టాలు వచ్చాయి అని, బ్యాంకుల జాతీయము, వెట్టిచాకిరి విముక్తి రాజ భరణాల రద్దు,శివాయ జమా చట్టం,భూసంస్కరణ చట్టం, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టాలే కాకుండా ప్రజలకు అనుకూలమైన అనేక చట్టాలు రావడంలో కీలక పాత్ర పోషించింది సిపిఐ పార్టీ అని తెలిపారు.స్వతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర ప్రముఖమైంది అని,ఎందరో కమ్యూనిస్టు నాయకులను స్వాతంత్ర ఉద్యమంలో బలి దానం కావడం జరిగింది అన్నారు. దున్నేవాడికే భూమి కావాలని జమీందారీ జాగీర్దారి వ్యవస్థ పోవాలని భూస్వాముల వద్ద వందల వేల ఎకరాలు కేంద్రీకరించడం సరికాదని, ఆ భూములు పేదలకు పంచాలని సిపిఐ జరిపిన పోరాట ఫలితంగానే భూ సంస్కరణ చట్టం వచ్చింది అని తెలిపారు.నైజాం నవాబుల దుష్ట పాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచినటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయిన సువర్ణ ఘట్టం అని తెలిపారు. అంటరానితనం సాంఘిక దురాచారాలు సాంఘిక దౌర్జన్యాలు పెత్తందారీ విధానాలు అంతం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ నిత్యం ప్రజల పక్షాన నిలబడి, కార్మికుల కర్షకుల కష్టజీవుల సమస్యలపై ఎనలేని పోరాటాలు చేయడం జరిగిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంగ్లేయుల పాలనలోనూ స్వతంత్రం వచ్చిన తరువాత కూడా అనేక కష్టాలను నిర్బంధాలను ఎదుర్కొన్నా, నమ్మిన సిద్ధాంతాన్ని పట్టిన జెండాను వదలకుండా వందేళ్లుగా దేశం కోసం ప్రజల కోసం నిలబడిన పార్టీ సిపిఐ అటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థగతంగా మూడేళ్లకోసారి మహాసభలు జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోందన్నారు..ఈ క్రమంలో సిపిఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగర్లో జరగనున్నాయి అని,రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20 నుంచి 25 వరకు ఒంగోలులో జరగనున్నాయి అని,.శ్రీ సత్యసాయి జిల్లా రెండవ మహాసభలు ధర్మవరం పట్టణము నందు జూలై 31 ఆగస్టు 1న జరగనున్నాయి అని తెలిపారు.ఉమ్మడి అనంతరం జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటు అయిన శ్రీ సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లాలోని ఆ తర్వాత ఏర్పాటైన శ్రీ సత్య సాయి జిల్లాలో సిపిఐ చేస్తున్నటువంటి పోరాటాలు లెక్కలేనివి వారు స్పష్టం చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించాలని హంద్రీనీవా ను పూర్తి చేసి ఆరికట్టుకు నీరు అందించాలని, కరువు నుంచి జిల్లాలో కాపాడ్డానికి శాశ్వత కరువు నివారణ చేపట్టాలని రైతులకు పండించిన పంటలు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి పరిశ్రమలు స్థాపించి, ఉపాధి సౌకర్యాలు కల్పించాలని, అలాగే లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను అక్రమార్కులు కా చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగింది అని తెలిపారు. ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని అనేక దఫాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది అని అన్నారు.జిల్లా కేంద్రమైన పుట్టపర్తిని కబ్జాల కోరల నుంచి కాపాడడానికి అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అనేక మంది పేదలు తలదాచుకోవడానికి జానెడు స్థలం లేని వారిని గుర్తించి వేలాదిమందితో శ్రీ సత్య జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వేలాది మందిని సమీకరించి వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పుట్టపర్తి లో కలెక్టర్ కార్యాలయం ముందు జరిగినటువంటి పోరాటాలు అపూర్వమైనవి అని తెలిపారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత ప్రధానమైన రంగం చేనేత రంగం చేనేత కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేయడం జరిగింది అని తెలిపారు. చేనేత రంగాన్ని కాపాడలని చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించాలని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అని, ధర్మవరం చేనేత పట్టువస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, అటువంటి చేనేతరంగాన్ని కాపాడి చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలని సిపిఐ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో లెక్కలేనన్ని పోరాటాలు చేయడం జరిగిందన్నారు.కబ్జాదారుల అక్రమార్కుల నుండి పేద రైతులకు అండగా నిలబడి కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది అని,ఆ క్రమంలో అడవి బ్రాహ్మణపల్లి తండా గిరిజనుల భూములను భూ బకాసురుడు అయిన గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ వారి అనుచరులు వారి భూములు కాజేస్తే గిరిజనులకు అండగా నిలబడి అక్రమార్కుల ఆట కట్టించడం జరిగింది అన్నారు.ప్రభుత్వ భూములను మటం భూములను కొంతమంది అక్రమంగా కాజేస్తే వాటికి అడ్డుకట్ట వేసి ఆ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని పోరాటం చేయడం జరుగుతున్నది అని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా చాలా వెనుకబడిన జిల్లా కరువు కోరల్లో నిత్యం నలిగిపోతున్న జిల్లా నిత్యం వలసలు రైతాంగ ఆత్మహత్యలు జరుగుతున్న, జిల్లా ఇటువంటి జిల్లా అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు..ఈ మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రూపకల్పన చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించే దిశగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు.కావున ఈ మహాసభలు జయప్రదానికై ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి, జయప్రదం చెయ్యాలని వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు