మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ.. అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప.
విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధను తప్పక కనపరచాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు నెలవారి చెకప్పులను తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. కుటుంబంలోని సభ్యులందరూ కూడా గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చేపట్టాలని తెలిపారు. ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి విరాళా దాతగా సంస్థ డైరెక్టర్ రాంప్రసాద్ వ్యవహరించడం పట్ల కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్ ఏపీ ఫణి మెరిట్ టెస్ట్ నందు రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించిన దాసరి లలితేష్, ఉక్కిసల ఓబులేసులు అభినందించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ ,సహకారదర్శి రామకృష్ణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధను కనపరచాలి..
RELATED ARTICLES