కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అరుదైన వైద్యం
- 40 ఏళ్ల రైతుకు గట్టిబడిన గుండె కండరాలు
- ఫలితంగా తగ్గిపోయిన రక్త సరఫరా
- ఏఎస్ఏ చికిత్సతో నయం చేసిన డాక్టర్ ప్రదీప్ కృష్ణ
విశాలాంధ్ర అనంతపురం ఆయాసం, గుండెదడ, ఛాతీలో నొప్పి, కళ్లు తిరగడం లాంటి మామూలు లక్షణాలతో వచ్చిన ఒక రైతుకు.. అసాధారణం, అత్యంత అరుదైన సమస్య ఉందని గుర్తించిన అనంతపురం కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు.. శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసి పంపారు. ఇందుకు సంబంధించిన వివరాలను చికిత్స అందించిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి.ప్రదీప్ కృష్ణ తెలిపారు.
తాడిపత్రి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రైతు తరచు ఆయాసం, గుండెదడ, ఛాతీలో నొప్పి, కళ్లు తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతూ వచ్చారు. ఆయనకు తగిన పరీక్షలు చేస్తే ఆయన అత్యంత అరుదైన హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి (హెచ్ఓసీఎం) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇది ప్రతి వెయ్యిమందిలో ఇద్దరికి మాత్రమే కనిపిస్తుంది. దీనికి ముందుగా కొన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో ఆయన గుండె విఫలమయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. దాంతో ఆయనకు ఆల్కహాల్ సెప్టల్ అబ్లేషన్ (ఏఎస్ఏ) అనే చికిత్స చేయాలని నిర్ణయించాం. చికిత్స అందించడం జరిగిందన్నారు.