Monday, June 23, 2025
Homeజాతీయంమళ్లీ దేశవ్యాప్తంగా భారీస్థాయిలో వర్షాలు పడే అవకాశం

మళ్లీ దేశవ్యాప్తంగా భారీస్థాయిలో వర్షాలు పడే అవకాశం

6 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
గత కొన్ని రోజులుగా విరామం ఇచ్చిన వర్షాలు, ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. జూన్ 23 నుంచి 28 మధ్య భారీస్థాయిలో వర్షాలు పడే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాలు ప్రధానంగా పశ్చిమ, కేంద్రీయ, దక్షిణ భారత ప్రాంతాల్లో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరా ఖండ్, ఈస్ట్ రాజస్థాన్ ప్రాంతాలలో వర్షాలు పడతాయని అంచనా. అలాగే దక్షిణ హిమాచల్ ప్రదేశ్, లడాఖ్, కశ్మీర్, జమ్మూ, పంజాబ్ వంటి ప్రాంతాల్లో వానలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

జూన్ 28 వరకు

ఈ వర్షాలు జూన్ 24 నుంచి ఢిల్లీ, చీజR ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో జూన్ 23 నుంచి 25 వరకు జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతాల్లో ఉండగా, పంజాబ్, హర్యానాలో జూన్ 23 నుంచి 25 వరకు వర్షాలు కురియనున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‎లో జూన్ 24 నుంచి 25 వరకు ఉంటాయని అంచనా. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో జూన్ 23 నుంచి 26 వరకు వానలు ఉండగా, ఈస్ట్ రాజస్థాన్ ప్రాంతాల్లో జూన్ 23 నుంచి 28 వరకు వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు ప్రాంతాల్లో కూడా..

మరోవైపు రానున్న నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఐఎండీ ప్రజలను అప్రమత్తం చేసింది. తెలంగాణలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు (జూన్ 23న) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రజలు సూచనలు

జూన్ 23 నుంచి 28 వరకు మధ్య భారతదేశం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, విదర్భ, చత్తీస్‌గఢ్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా వానలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అసోం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. స్థానిక అధికారుల సూచనలు పాటించి జాగ్రత్త వహించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు