Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టీఆర్‌ఎస్‌, బీజేపీ రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ పర్యటనలతో రైతాంగానికి, తెలంగాణకు అయ్యేది, పొయ్యేది ఏమి లేదన్నారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. దిల్లీలో సీఎం కేసీఆర్‌ సేద తీరుతున్నాడన్నారు. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని అన్నారు. రైతాంగానికి అండగా ఎప్పటికీ నిలిచేది కాంగ్రెస్‌నే అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img