: భట్టి విక్రమార్క
కోవిడ్ బారిన పడి చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తుందని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. కరోనా బారిన పడి ఎందరో తమ జీవితాలు, ఆస్తులను పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. కోవిడ్ బారినపడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా వీలైనంత ఎక్కువ ప్రకటించాలని కోరారు. రూ. 50 వేల ఎక్స్గ్రేషియా సరిపోదని, రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండు చేశారు. రూ. 4 లక్షల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం వాదిస్తోందని, ఇది సరైన వాదన కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో తెలియజేయాలని డిమాండు చేశారు.