సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం, ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది.42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణయ్యింది. పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 43 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. మిగతావారికి ఇవాళ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను అధికారులు వైద జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపారు.పాజిటీవ్ వచ్చిన విద్యార్థులను వసతి గృహంలోనే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.