- Advertisement -
ప్రముఖ సిపిఐ(ఎం) నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ (102) సోమవారం మధ్యాహ్నం మరణించారు.గత నెలలో గుండెపోటుతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కె.వసుమతి. కుమారుడు అరుణ్కుమార్, కుమార్తె డా. ఆశాలు ఉన్నారు.


