ఏపీ సీఎం జగన్కు ముద్రగడ ఘాటు లేఖ
సీఎం జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాసిన ముద్రగడ పద్మనాభం తాజాగా మరోసారి ఓటీఎస్ పై బహిరంగ లేఖను రాశారు. ఓటీఎస్ పేరుతో ప్రజలపై ఒత్తిడి తీసుకురావద్దని లేఖలో ఆయన కోరారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వాలు కట్టించి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం మీకెక్కడిదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ సమయంలో జరిగిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని మీకు ఇప్పుడు ఓటీఎస్ పేరుతో డబ్బు వసూలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మీ నిర్ణయం సరికాదని, వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు.