ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలౌన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని అన్నారు. ండు రోజుల క్రితం ఓ బాలిక తప్పిపోయింది. ఈ రోజు ఆమె శవమై కనిపించింది. దీనికి ఎవరు బాధ్యతవహిసారని ప్రశ్నించారు. గణాంకాల ప్రకారం మహిళలకు రక్షణలేని రాష్ట్రంగా యూపీ నిలిచిందని అన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన 750 మంది రైతుల చావుకు బీజేపీ కారణమైందని అన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ ఆ పార్టీని రైతులు నమ్మడం లేదరన్నారు.