- Advertisement -
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లోని చుండి గ్రామంలోని పడమటి వీధిలో గల గణేష్ యూత్ పోర్స్ వారు నిర్వహించన గణేషుడి విగ్రహం వద్ద ఉన్న లడ్డు వేలంపాట గురువారం సాయంత్రం జరిగింది.ఈ లడ్డు వేలంపాట వలేటివారిపాలెం మండలంలోనే రికార్డ్ స్థాయిలో నిలిచిందని కమిటీ సభ్యులు తెలిపారు.స్థానికంగా చుండి పడమటి వీధిలో ఉన్న చుండి మాల్యాద్రి ఈ లడ్డు వేలంపాటలో పాల్గొని అక్షరముల ఎనబైఐదు వేల రూపాయలకు స్వామి వారి లడ్డు ప్రసాదములను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పడమటి వీధి ప్రజలు, యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


