రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైనదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. మాస్కో-కీవ్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా ఆయన నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం. జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు, ఁరష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు, ఆంక్షలు విధించడం సరైన చర్యఁ అని చెప్పారు. ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో వేదిక పంచుకున్న సందర్భాన్ని ఆయన ఈ వ్యాఖ్యలకు ఉదాహరణగా తీసుకున్నారు.
మాస్కోపై కొత్త ఆంక్షలు అమలుకాకుండా చూడవలసిన బాధ్యత అమెరికాకు ఉంది
అలాస్కాలో ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమైన తరువాత, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ప్రకటన వెలువడటం గమనార్హం.
నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాస్కోపై కొత్త ఆంక్షలు అమలుకాకుండా చూడవలసిన బాధ్యత అమెరికాకు ఉందని చెప్పారు. ఁఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలు చేయడం మాకు బాధ్యత. ఉదాహరణగా, భారత్ ఇంకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దీనిపై మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంక్షల స్థాయి, వాటి అమలు సమయం వంటి అంశాలపై భవిష్యత్తులో చర్చ జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉంది
ఇటీవల కాలంలో ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా ప్రయత్నాలు చేస్తోంది.
ప్రధాని మోదీ పుతిన్, జెలెన్స్కీ రెండింటితోనూ చర్చలు జరుపుతున్నారు.
గత నెల రెండో వారంలో పుతిన్తో భేటీకి ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడారు.
ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నట్లుగా,ఉక్రెయిన్కు సంబంధించిన తాజా పరిణామాలపై జెలెన్స్కీతో చర్చించాను. ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నాను. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కరించడానికి భారత్ కట్టుబడి ఉందని తెలియజేశాను.యుద్ధం ముగింపులో సహకారం అందించడం,ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భారత్ కృషి చేస్తుందిఁ అని చెప్పారు. జెలెన్స్కీ కూడా తాము ముఖ్యమైన అంశాలపై విశదంగా చర్చించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇలాంటి సందర్భంలో భారత్పై ప్రతికూల వ్యాఖ్యలు ఆయన నుండి రావడం గమనార్హం.


