విశాలాంధ్ర -ధర్మవరం : భగవాన్ రమణ మహర్షి వారి 145వ జయంతి మహోత్సవ వేడుకలు పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపాన వేదం వారి తోటలో ఈనెల 17వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ రమణ మహర్షి 20 సంవత్సరములకు ఒక పర్యాయం మాత్రమే ఇటువంటి తిథులు వస్తాయని తెలిపారు. భగవాన్ సేవకు స్పందించి అందరూ సాయం అందించండి అని తెలిపారు. అదేవిధంగా ఈనెల 13వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఆశ్రమమునందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అరుణాచల మహాదీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దీపం 11 రోజులు పాటు నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. 17వ తేదీన ఆశ్రమంలో మహాగణపతి పూజ రమణ పూజా కార్యక్రమం అరుణాచల అక్షర మణిమాల భక్తి ప్రవచనాలు ప్రాకారోత్సవాలు జరుగునని తెలిపారు. అనంతరం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో వచ్చి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
రమణ మహర్షి 145వ జయంతి మహోత్సవ వేడుకలు
RELATED ARTICLES