Homeతెలంగాణపొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన.. 4వేల ఎకరాలకు నూతన భూ పట్టాలు!

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన.. 4వేల ఎకరాలకు నూతన భూ పట్టాలు!

- Advertisement -

అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4,000 మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలు జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలంలో సాగు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలూనాయక్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, పీసీసీఎఫ్‌ సి.సువర్ణ, నల్గొండ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివరాల ప్రకారం, భూభారతి పైలట్‌ ప్రాజెక్ట్‌లో తిరుమలగిరి (సాగర్‌) మండలంలోని 23,000 ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు.

బోగస్ పాస్ పుస్తకాలు రద్దు
దీని ఫలితంగా 12,000 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. వాటిలో 8,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. 4,000 ఎకరాలకు ఇప్పటికే పాసుపుస్తకాలు ఉన్నాయి,
మిగిలిన 4,000 ఎకరాలకు కొత్త పాసుపుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. సర్వేలో 3,069 మంది పేరుతో 2,936 ఎకరాలకు బోగస్‌ పాసుపుస్తకాలు ఉన్నట్లు గుర్తించి రద్దు చేశారు.
వీటికి సంబంధించిన రైతుభరోసా మరియు రైతు బీమా కూడా రద్దు చేశారు. అంతేకాకుండా, 7,000 ఎకరాల అటవీ భూమిని గుర్తించారు. మంత్రిత్వం ప్రకారం, పేద ప్రజలు సాగు చేస్తున్న భూములపై హక్కులు కల్పించడంలో రెవెన్యూ, అటవీ శాఖలు మానవీయ కోణంలో ఆలోచన చేయాలని అధికారులకు ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు