- Advertisement -
చిత్తూరు ఆర్టీసీ డిపోలో రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రయోగం చేపట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా డీజిల్ బస్సును సీఎన్జీ బస్సుగా మార్చి ప్రారంభించారు.ఈ ప్రయత్నానికి పునాది వేసినదే ఆర్టీసీ అధికారులు, థింక్ గ్యాస్ అనే సంస్థ సహకారం అందించింది. ఈ కొత్త సీఎన్జీ బస్సులో మొత్తం 8 సిలిండర్లు అమర్చారు.ఒక్కో సిలిండర్ 11.2 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది.ప్రతి కిలో గ్యాస్ బస్సుకు సుమారు 5 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.ప్రస్తుతం ఈ బస్సును చిత్తూరు-వేలూరు మార్గంలో నడుపుతున్నారు. ఈ ప్రయత్నం పై ఏడాది పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.


