Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సోనియా దేశ ద్రోహి.. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటికి రావాలి: కేఏ పాల్‌

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌.. కాంగ్రెస్‌ నేతలు పొగుడుతున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని విమర్శించారు. అసలు కాంగ్రెస్‌ పార్టీనే దేశ ద్రోహి పార్టీ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ 48 ఎంపీ స్థానాలకు పరిమితమైందని, రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30 లేదా 20కి చేరుతుందని కేఏ పాల్‌ జోస్యం చెప్పారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని చెప్పుకొచ్చారు. పార్టీల కంటే మనకు దేశమే ముఖ్యమని అన్నారు. జాతీయ రైతు నాయకుడు రాకేశ్‌ టికాయత్‌పై జరిగిన దాడిని ఖండిరచారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదన్నారు.అలాగే హైదరాబాద్‌లో రెడ్డి సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. అది మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిందంటూ వ్యాఖ్యానించారు. అయితే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారే పేరు చివరన రెడ్డిని తీసేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో మాటల దాడులు కూడా మానేయాలని హితవు పలికారు. మతాలు, కులాలను వాడుకుని రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img