సీపీఐ 24వ జాతీయ మహాసభల లోగోను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా విడుదల చేశారు. న్యూదిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్ భవన్లో ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అక్టోబరు 14 నుంచి 18 వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల లోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యదర్శులు అమర్జిత్ కౌర్, వినయ్ విశ్వం, పల్లవ్సేన్ గుప్తా, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.