Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పాఠశాలలను తనిఖీ చేసిన మండల ఉపాధ్యక్షులు కారికాటి నిర్మల

వాకాడు:(విశాలాంధ్ర)మండల పరిధిలోని మూలపడవ పంచాయతీలోని పాఠశాలలను పరిశీలించిన మండల ఉపాధ్యక్షులు కారికాటి నిర్మల పంచాయితీ లోని నలగామాల జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను మరియూ లక్ష్మీపురం,పామలతెరిలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలను అంగన్వాడి కేంద్రాలు మరియు మధ్యాహ్నం భోజనం పథకాన్ని బుధవారం ఆమె పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి భోజనం నిర్వాహణ గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం భోజనాన్ని స్టాక్ రూమ్ ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ సక్రమంగా అమలు చేయాలని నాణ్యమైన భోజనం అందించాలని కార్మికులకు సూచించారు. అదేవిధంగా అంగనవాడి కేంద్రాలలో గర్భిణీలకు,చంటి,బిడ్డలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఆమె చూసించారు ఆమె వెంట గ్రామ వాలంటరీ చిట్టిబాబు తదితరులు ఉన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img