Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఆర్కే బీచ్‌లో వివాహిత మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌.. నెల్లూరులో యువకుడితో ప్రత్యక్షం

విశాఖ ఆర్కే బీచ్‌లో రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ మిస్సింగ్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది.ఆమె నెల్లూరులో ప్రత్యక్షమైంది.అక్కడ ఓ యువకుడితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య సముద్రంలో కొట్టుకుపోయిందంటూ రెండ్రోజుల క్రితం సాయిప్రియ భర్త శ్రీనివాసరావు విశాఖ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఆమె గల్లంతైందనట్లు భావించిన పోలీసులు సముద్రంలో జల్లెడ పట్టారు. రెండ్రోజులుగా స్పీడ్‌ బోట్లు, నేవీ హెలికాఫ్టర్‌ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే, పెళ్లిరోజున భర్తతో కలిసి బీచ్‌ కు వచ్చిన సాయిప్రియ.. శ్రీనివాస్‌ మొబైల్‌ చూస్తున్న సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయిందని సమాచారం. అయితే సముద్రంలో గల్లంతైనట్టు భర్త శ్రీనివాస్‌ భావించారు. విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిప్రియ కోసం స్పీడ్‌ బోట్లు, నేవీ హెలికాప్టర్‌తో సెర్చ్‌ ఆపరేషన్‌ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఆమె ఓ యువకుడితో నెల్లూరు వెళ్లినట్లు సమాచారం. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు భారీగా ఖర్చు చేశారు. హెలికాప్టర్లు, బోట్లలో గాలించారు. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ అన్నారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు తెలిసిందని.. ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img