Homeజాతీయంతమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్.. ఏపీకీ వర్ష సూచన

తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్.. ఏపీకీ వర్ష సూచన

- Advertisement -

నేటి మధ్యాహ్నం శ్రీలంక తీరం దాటనున్న వాయుగుండం

ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వాయుగుండం శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు శ్రీలంకలోని ట్రింకోమలి – జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే క్రమంలో ఇది బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరువారూర్, నాగపట్నం, మయిలాడుతురై, కడలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ాఆరెంజ్్ణ అలర్ట్ జారీ చేసింది. రాజధాని చెన్నైతో పాటు చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ాఎల్లో్ణ అలర్ట్ ప్రకటించారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరగగా, తాజా వర్ష సూచనతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలో వర్షం కురిసే అవకాశం లేకపోయినప్పటికీ, పొడి వాతావరణం, పొగమంచుతో కూడిన చలి గాలులు కొనసాగనున్నాయి.

సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. జనవరి మాసంలో ఇలాంటి తీవ్ర వాయుగుండాలు రావడం అరుదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు