ఆన్లైన్ దిగ్గజం అమెజాన్కు గట్టి షాక్ తగిలింది. తన వెబ్సైట్లో నాసిరకం ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తుండటంతో ది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఆథార్టీ(సీసీపీఏ) లక్ష రూపాయల జరిమానా విధించింది. కంపెనీ ప్లాట్ఫాంలో 2,265 మంది కొనుగోలు చేసిన ప్రెషర్ కుక్కర్లను పరిశీలించి, ఇవి నాసిరకమని తేల్చింది. దీంతో ఈ ఉత్పత్తులను రీకాల్ చేయడంతోపాటు కొనుగోలుదారులకు తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. క్వాల్టీ కంట్రోల్ కోడ్(క్యూసీవో)కు విరుద్ధంగా నాణ్యత ప్రమాణాలు లేని ఉత్పత్తులను విక్రయించినందుకుగాను అమెజాన్కు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ కుక్కర్లను విక్రయించడంతో అమెజాన్కు రూ.6,14,825.41 ఆదాయం లభించింది.